73.) సరిమలుపు అంటే ఏమిటి? సరివివరణతో కూడుకోబడిన ప్రయాణం అంటే ఏమిటి?
స్థూలవివరణల నడుమున స్థూలరసద్రావకాలతో తయారుగావింపబడిన తీగలు.అలా మొదలుగా తీగలను అల్లికలు వేయుటలో అచ్చులు,హల్లుల నిర్వహణలలో అల్లికలు వేసిన గుణింతాలు,ఆ గుణింతపు నిర్వహణలో అల్లికలు వేసిన పదము,పదములు,పదజాలాలు, పదజాల అల్లికలు,పదజాల అల్లికలతో కూడుకోబడిన వాఖ్యము,వాఖ్యానుసారము, వాఖ్యానుసారములు,వాఖ్యానుసారకూర్పులు ఇలా తీగల అల్లికలలోని వివరణలలోనే ఇప్పుడు మనము జీవించే జీవిత కాలక్రమదారులు.కావున ఒక పదనిర్వహణకు సంపూర్ణ అర్థం కూర్చుటకు గాన అనేక కోణవివరణలు వెలువరింపబడ్డాయి.ఆ కోణాలే తల్లికోణము, తండ్రికోణ వివరణ,భార్యకోణము,భర్తకోణము,బిడ్డకోణము,సోదరి కోణము,సోదరుడి కోణము ఇలా ప్రస్తుత మనము చెప్పుకునే సత్సంబంధ బాంధవ్యాల అల్లికలతో కూడుకోబడిన తీగలు బాల్యము మొదలు వృద్ధాప్యము,ఒక కోణము తరువాత ఒక కోణము అన్నటుల తాత,అవ్వ, జేజి,అబ్బ,ముత్తవ్వ,ముత్తాత కోణములు చివరి నిర్వహణలో పూర్తి అగును.ఆరకంగా మొదలు కాలము యందు వీటి అన్నింటి యెడల మొదటి కోణవివరణలు రెండవ కాలమున రెండవ కోణవివరణలు అలా కాలక్రమముల యందు కోణపులోతు వివరణలు పెరుగుతు పోవుటలో వీటికి సంపూర్ణ అర్థంను చేకూరుస్తు పోవడము జరిగెను.కావున అదే స్థూలవివరణల నడుమున ఈ స్థూలతొడుగుల యందు మానవజన్మకు తొలితదశ యందు స్థూలమే వర్తిస్తుంది అన్నటుల స్థూలమునకు 24లక్షల స్థూలనాడీమండలములను ప్రథమనాడుల యందు అలవరుచుటలో ఆ స్థూలనాడీమండలముల యందు స్థూలకణాలు నిల్వరింపబడియున్నాయి.ఆ కణాలు నాడీమండలముల నుంచి ప్రథమనాడులలోనికి విడుదల అగుట అనగా తల్లి నాడీమండలము నుంచి తల్లికణాలు అలా ఒక్కొక్క నాడీ మండలమునకు ఒక పాత్రపోషణ అన్నట్లు అలవరచడము జరిగెను.కావున ఆ కణకదలిక సారాంశయుతతీగల అల్లికలలోని వివరణలే కాలక్రమమున కోణపుతీగల అల్లికలు.కాబట్టి ఆ కాలక్రమదారులలో ఈ స్థూలతొడుగులలోని జీవప్రమాణికములు జీవించుట యందే ఆ స్థూలతొడుగు కాలమనే భూపొరపై నిల్వరింపబడెను.కాబట్టి నిరంతర కాలక్రమదారులలో ఈ స్థూలతొడుగులో జీవప్రమాణికములు జీవించడము అలా జీవించుట యందు జీవిత అనుభవము వెలుబడుటలో ఆ అనుభవాలను బట్టి స్థూలతొడుగులు కూడ అనుభవమైనవిగా కదులుటలో అవి బాహ్యప్రదర్శనలుగా బాహ్యపుపొరలపై నింపబడెను. అలా బాహ్యానుభవలోతులు అలబెను.ఆ అన్ని అనుభవనిర్వహణ లోతులు ఈ స్థూలతొడుగు యందే కలవు.కావున ఆ బాహ్యానుభవ లోతుల్లో మనస్సు అనే పదనడక పుట్టుకరాబడటం అన్ని అనుభవనిర్వహణతో కూడుకోబడిన ఈ స్థూలతొడుగు మనస్సు లోతుల్లో మనిషిగా తయారు అవుతు పోవడము మొదలయ్యెను.కావున కాలక్రమ కోణపులోతుల దారులే జీవప్రమాణికములు జీవించుటలో మొదలు అనుభవమున బాహ్యానుభవదారులుగా ఆ తరువాత మనస్సు అనే పదనడక పుట్టుకరాబడుటలో మనస్సుదారులుగా మారుటలో ఆ మనస్సుదారులలో ఈ మనిషిగా మారుతు పోయే స్థూలతొడుగులలోని జీవ ప్రమాణికములు తమ అనుభవములో తాము జీవించబడుట యందు పూర్తి అనుభవపూర్వక స్థిరస్థితి అలబడక మునుపే అర్థం అయ్యి,అర్థం కాక అంతోఇంతో ఏర్పడబడిన ఇష్టా అయిష్టాల నడుమున ఆ తీగల అల్లికలతో కూడుకోబడిన దారులను అటుఇటుగా మలుచుకోవడంతో మనస్సుపొరయే మనస్థత్వపొరగా మారెను.కాబట్టి ఈ స్థూలతొడుగు మనస్సులో మనిషిగా ఎదగకపోగా మనస్థత్వ దారులలో చిక్కుక పోవడం జరిగెను.కావున ఆ తీగల అల్లికలతో కూడుకోబడిన దారులను మరళ సరిమల్చుట అని అనుటలో మరళ జీవస్థితి ప్రమాణికము తమ అనుభవాన్ని గుర్తుఎరిగి సరిదారికి రావుటలో వంకర వినికిడి,చూపు,మాట,చేత,నడక పరనడుమున కదిలాడే ఈ స్థూలతొడుగు సరి వివరణాత్మక దారిలో జీవప్రమాణికము కదిలితే ఇవి అన్నియు సరివివరణగా మలువబడును.అప్పుడే సరివివరణాత్మక దారుల అలవరిక పరనడుమున మనస్సులో మనిషిగా ఎదిగెదము.