56.) ఒక స్థితికి రావడము అన్నది ఎలా మరల ఆ స్థితిని ఎలా కోల్పోవుదము అన్నది కూడ ఎలా జరుగును?
మొదలు స్థితి అనగా మన అనుభవమున జీవస్థితి ప్రమాణికములు ఒక్కొక్క అడుగున స్థిరస్థితిగా నిలద్రొక్కుకొనడము.ఎందుచేతననగా ఒక్కొక్క కోణము ఒక్కొక్క అడుగుకు వర్తించును.కాబట్టి ఆ కోణపు తీగఅల్లికలోనే జీవస్థితి ప్రమాణికము జీవించును.అలా జీవించుట యందే అది తల్లి కోణమైనట్లైతే తల్లిజీవముగా అనుభవము నొందును.కావున ఆ అనుభవపూర్వక తల్లి స్పందనతో ఆ తల్లిజీవము వినికిడి అయిన,చూపు అయిన,మాట అయిన,చేత అయిన,నడక అయిన వుండవలె.అప్పుడే తల్లితనము అంతటా నిల్వరింప బడును.కావున ఆ అడుగు కోణపులోతుల్లో స్థిరస్థితిగా నిలద్రొక్కుకొనుటలో ఆ అడుగు యందే కదిలాడే ప్రకృతి తల్లినడువడి యొక్క హావము,హావభంగిమ అలాగే నిల్వరింపబడి యుండును.అలా నిల్వరింపబడే విధానమునే జీవానుభవ స్థిరస్థితి అనెదము.కావున ప్రకృతి యథాతదా నిర్వహణలో తల్లిహావము,హావభంగిమలో కదిలాడుతుంటునే తల్లితన జీవము ఒక రసస్థితినినొందినట్లు లేని పక్షంన ఆ తల్లి కోణపు తీగఅల్లికలో జీవస్థితి యొక్క ప్రమాణికము సరియైన అనుభవము స్థిరత్వం రాని యెడల ఆ కోణపు తీగఅల్లికతో కూడుకోబడిన దారి అటుఇటుగా ఊగిసలాడిన,అక్కడక్కడే తొనికిసలాడిన ఆ తల్లి జీవస్థితి ప్రమాణికములో సరియైన వినికిడి,చూపు,మాట,చేత,నడకలు తల్లి జీవఅలవరికకు తగ్గట్టుగా కదలవు.తదనుగుణంగా ఆ కోణపులోతు అడుగులో ప్రకృతి కూడ తల్లిహావము, హావభంగిమలో సరిగ్గా వెలువరింపబడవు కావున ఆ అడుగు కోణపులోతు వివరణలో జీవస్థితి యొక్క ప్రమాణికమునకు సరి స్థిరస్థితి అన్నది వెలుబడలేదు అని కాలం నిర్దారించును.ఎందుచేతననగా ఆ కాలక్రమదారులలోనే జీవస్థితి యొక్క ప్రమాణికము తొడుగు అలవరికలో జీవిస్తున్నాయి కావున జీవానుభవములలో తొడుగు పైభాగాలు అనుభవమైనవిగా కదులుటలో బాహ్యానికి చూపునట్లు బాహ్యప్రదర్శనగా బాహ్యపుపొరపైన కదులును.కావున బాహ్యానుభవ విలువగా అనగా జీవానుభవము యందు అది తల్లిజీవము అయినట్లైతే తల్లి ప్రవర్తన,తల్లి వ్యక్తిత్వము,గుర్తింపు,విలువ అన్నట్లు కాలమాన పట్టిక విలువకట్టును.తదనుగుణంగా ఆ తల్లికోణపు తీగఅల్లికతో కూడుకోబడిన వివరణకు తగ్గట్టుగా ఆ కాలమనే భూపొరలోనికి భూసారాంశయుత తీగను విడుదల చేయుటలో జీవానుభవము మేర ఆ కోణపులోతు రసద్రావకాలు ప్రాకృతికమండలము నుంచి వెలువరింపబడి భూసారాంశయుతతీగ లోనికి చేరగానే జీవానుభవము మేర ఆ రసద్రావకాలను మిళితం చేసి సారంగా కూడగట్టుటలో ఆ సారములో నుంచియే తినే తిండి, త్రాగే నీరు,గూడు,గుడ్డ మరియు భూ స్థలసేకరణ ఇంకను వాళ్ళ అనుభవస్థిరస్థితి పెరుగుతు పోయేకొలదివారి పేరుబలాలపై రాతి,ఇనుము,ఉక్కు,బంగారం పుట్టుకొచ్చును.వాటినే బాహ్యసంపద అనెదము.కాబట్టి ఆ కోణపు తీగఅల్లికలోని వివరణకు తగ్గట్టుగా జీవప్రమాణికము స్థిరస్థితిగా అనుభవములో నిలద్రొక్కుకొన్నట్లైతే ఆ సంపద కూడ స్థిరస్థితిగా నిలబడును.అప్పుడే వాళ్ళు ఒక స్థితిలో వున్నారని బాహ్యానికి కానవచ్చు విధానము.కావున మన అనుభవస్థితి గతులలో స్థిరస్థితిగా నిలద్రొక్కుకొంటేనే లోపలిస్థితిని బట్టి బాహ్యస్థితి అలాగే నిలబడును. అప్పుడే ఒక్కొక్క అడుగు స్థిరస్థితిలో అడుగు అడుగుకు స్థితి పెరుగుతు పోవును.