విద్యా విషయాలు

20.ప్రధానాంశస్థితి వివరణ :

మనస్సే హృదయంగా మారుతు పోవుటలో అన్ని కాలాల బాహ్యపుపొరల నడుమన అనుభవనిర్వహణ యొక్క నడక బాహ్యలోకంగా మారుతు,అందున మన యొక్క అనుభవాన్ని గుర్తుఎరుగుటకు గాను ఐదు జ్ఞానేంద్రియాలు రెండు కనుబమల మద్య ఏకమై ఒకప్పటిమన అనుభవాన్ని గమనించగా,ఖచ్చిత గమనిక వేయగా ఆ తదుపరి గమనార్హములో విశదీకరింపబడిన తరువాత అది సరివివరణతో కూడుకోబడిన దారియే అని లోకగమనము చేత నిర్దారింపబడిన తరువాత గమనములో జ్ఞానేంద్రియాలు ఏకీకృతమగును.అలా ఏకీకృతం కాబడగానే జన్మపర్యంతములపర నడుమన తీగ కదులును.ఉదహరించి బాహ్యంలో తల్లి అనుభవాన్ని అంతా తల్లికోణాల యొక్క లోతుల్లో గుర్తు ఎరుగుతు పోయినట్లైతే ఒక్కొక్క కోణపులోతుకు ఐదు జ్ఞానేంద్రియాలు ఏకీకృతమగుతు వచ్చును.అలా చూస్తే తల్లి సంబదిత కోణపు లోతులన్ని జ్ఞానేంద్రియాల పర నడుమన ఏకీకృతమగుట ద్వారా జన్మపర్యంతముల పర నడుమన తల్లితీగ అనుసారికములన్నియు కదిలినట్లే.అలా తీగలన్ని కదులుటలో ఆ తదుపరి ఆ తల్లి అనే కదలిక జీవోదయ కదలికగా మారుటయందు బాహ్యపుపొర కొంచెంగా తొలిగిపోయి అంతరపుపొర విచ్చుదల పరనడమున భూపొరలోని తల్లి సారాంసయుత తీగ లన్ని ఏకంచేస్తూ ప్రకృతి తల్లి స్థానపు పొరను రూపొందించుకొంటూ వచ్చును.అప్పుడే తల్లి అనే పద నిర్వహణకు స్థానబలము,స్థానబలనం చేకూరును.అలా చేకూకుట యందే అన్ని జన్మపర్యంతపుపొరలనడుమున జన్మపుపొర కూడ విచ్చుదల కాబడుతు వచ్చును.అలా విచ్చుదల కాబడతుపోవుటలో బ్రహ్మరంధ్రం మధ్యభాగమున తల్లితీగ అనుసారికము కదిలి తల్లి నాడీమండలమంతయు కదులును.తల్లి నాడీమండలపుపొరలలో తల్లి కణకదలిక సారాంసయుతతీగలలో నింపబడిన ప్రధమనాడీ యంతువు కదులును.ఆ ప్రధమనాడీ కదులుటలో పిల్లనాడులన్నియు కదులును. ఆరకంగా ఒక తల్లి అనే కదలి కకు ప్రదానాంశస్థితి వివరణ ఏర్పడబడినట్లు,బాహ్యపుపొరల నడమున అన్ని కోణాల వివరణాయుత విషయఅల్లికల దారులను బట్టి ఒక స్త్రీ తొడుగు అలవరికతో కూడుకోబడిన పాత్రపోషణ లు,అదే విధముగా పురుష తొడుగు అలవరికతో కూడుకోబడిన పాత్రపోషణలు,నఫుంసక పాత్రపోషణ ,పాత్రపోషణల నడములో అనుభవమంతయు వెలికితీతకు రాబడుటలో తల్లి,తండ్రి కదలిక,సోదరి సోదరుని కదలిక,భార్య భర్త కదలిక,అలా అన్ని కదలికలు మారుతు బాహ్య కదలికలుగా మారిపోయి ఆ తదుపరి ఆ కదలికలలోని శ్వాసఅంతయు ముక్కుకొణ నుంచి ప్రథమ శ్వాసానాళము,శ్వాసానాళము నుంచి నాభి మధ్యము భాగం చేరుకొనని నాభిపొరల చుట్టూ తిరుగుతూ ప్రథమ నాడిలోనికి ప్రవేశించిఆ శ్వాసాస్థితి యొక్క అలవరికలో జీవప్రమాణికము అంతయు మనస్సు అద్దంలోనికి చేరుకొనును. అలా మనస్సు అద్దంలోనికి చేరుకోగానే శబ్ద తరంగాలలో అనుభవాన్ని తిరిగేస్తూ జీవతరంగాలుగా మారిపోయి జీవోదయకదలికగా మారిపోవును.అప్పుడే కదలికకు తగ్గట్టుగా స్పందన వెలుబడను.స్పందన వెలుబడగానే బాహ్యపుపొర తొలిగిపోయి అంతరపుపొర విచ్చుదల అగును.అనగా బాహ్యము కొంచెంకొంచెంగా తొలుగును.అంతకపుపొర విచ్చుదల కాబడుతూ పోవడమన్నది మనస్సే హృదయంగామారులుపోవడం.అలా ఒక్కొక్క కదలిక బాహ్యకదలికగా ఆ తదుపరి అంతర కదలికగా మారుటతోనే ఒక్కొక్క కదలికకు ప్రధానాంశస్థితి వివరణ ఏర్పడుతుపోవును.

Download PDF Now