36.ఒక ప్రకృతి యొక్క అణువు గమనంగ మారుతుపోయే విధానము :
ప్రకృతి ప్రసారితల నడుమున అనేకరక శబ్ద అలవరికలు వెలువరింపబడును.ఆ శబ్దాన్ని బట్టి పలానా అని దృష్య చిత్రీకరణ కూడా ప్రకృతియే చిత్రీకరించును.ఒక జీవతత్వ పొరలోనుంచి జీవమును స్వార్థజీవముగా,పగతో కూడుకోబడిన జీవముగా,తల్లి జీవముగా మలిచినది కూడా ప్రకృతియే.అలా తల్లి కోణపు లోతు నుంచి తల్లి శ్వాసను మరియు ఒక్కొక్క జీవ అలవరికకు ఒక్కొక్క శ్వాసను జీవతత్వ పొరలో వెలువరించి,ఆ శ్వాసలను ప్రాణామయ శ్వాసలుగా మారుస్తూ జీవమును తోటి జీవస్థితితో లింకులు కూర్చినది ప్రకృతియే.ఆ జీవము కదిలే విధనాన్ని అంతర్వాని పదజాల అల్లికలతో కూడుకోబడిన పదశబ్దాలుగా వెలువరించినది ప్రకృతియే.ఆ జీవము కదిలే దారి అలవరిక నడకకు స్పర్శను అందించునది ప్రకృతియే.అలా వివిధ రకాల ప్రకృతి యొక్క పనిక్రమ తీరులు ఇవి.కావున అదే జీవ అనుభవాన్ని 5 జ్ఞానేంద్రియాలు ఏకంలో కదిలే విధానాల తీరు ఆ ప్రకృతి యొక్క అణువులోనే కలదు.అనగా 5 జ్ఞానేంద్రియాల పనిక్రమ తీరులు ప్రకృతి యొక్క అణువులోనే స్పష్టంగా కానవచ్చును.కాబట్టికాలగర్భ ప్రాకృతిక మండలము నుంచి ఈ ప్రకృతి యొక్క అణువు విడుదల అవును.అలా విడుదలై రెండు కనుబమ్మల మధ్యకు చేరుకొనును.అలా చేరుకొనుటలోనే 5 జ్ఞానేంద్రియాల ఏకం చేత ఒకప్పటి మన అనుభవాన్ని గమనిస్తూ పలానా అని కచ్చిత గమనిక వేస్తూ గమనార్హంలో విషదీకరింపబడుట ద్వారా ఆ 5 జ్ఞానేంద్రియాలు ఏకీకృతమై వెనువెంటనే జీవము అనుభవంలో దారి నడుమునకదులుటకు ఉండును.గమనము ఏర్పడనంత వరకు చెవితో వినడం,వినిన దానికి తగ్గట్టుగా కంటితో చూడటం,ఆ రెండింటి యొక్క అనుభవముతో కూడుకోబడిన జీవము శ్వాస ఆధారితముగా కదలడం అలా కదులుతండగానే తీగల అల్లికల పరనడుమున పదశబ్దాలుగా నోట్లో నుంచి వెలువరింపబడటం,వెనువెంటనే జీవము కదిలే విధానములో స్పర్శ అందడం విడివిడి భాగాల మధ్య జరుగును.కాబట్టి ఒక కోణపు లోతు తగ్గట్టుగా ఇవి ఏకం అయితేనే పలానా అని గుర్తించుటకు ఉండును.