స్థూల వివరణ

116.) భూపైన రాయి పడితే శబ్దము పలుకపోవుటకు కారణం ఏమి?

sthoolavivarana

కాలగర్భాల చుట్టు కాలాలు రూపొందింపబడుతు వచ్చును అని అనుటలో అవి భూపొరలు. అందున ఒకటవ కాలము అని అనుటలో మొదలు విషయసంపుటిల నిర్మాణమునకు కారణమైన ప్రాకృతిక మండలము కాలగర్భంలోనే నిల్వరింపబడి అందున మొదలు విషయసంపుటి జీవనాడి యొక్క అనుసారికములోనికి విడుదల చేయుటలో ఆ విషయసంపుటి నుంచి మొదటి వివరణల పరనడుమున మొదటి కోణాల వివరణలు ఒకటి తరువాత ఒకటిగా విడుదల అవుతు రావుటలో అవి ఎంతవరకు విడుదల అవుతాయో అంతవరకు మాత్రమే కాలగర్భం కాలం అనే భూపొర పుట్టుకొచ్చును. అది ఏలననగా ఆ మొదటి కోణపుతీగల అల్లికలతో కూడుకోబడిన వివరణలు ఏ స్థూలరసద్రావకాలతో నిర్మితం అయ్యేనో ఆ ద్రావకాల పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము ఆ ద్రావకాలను పుట్టించగా ఆ ద్రావకాలను మిళితం గావింప చేస్తు భూపొరగానే నిర్మితం చేస్తు వచ్చును. కాబట్టియే కాలగర్భం నుంచి కాలం పుట్టుకొచ్చును. అదేవిధంగానే రెండవ విషయసంపుటి నుంచి రెండవ కోణపుతీగలు ఒకటి తరువాత ఒకటిగా వెలువరింపబడుటలో అవి ఎంతవరకు విడుదల అవుతాయో అంతవరకూ మాత్రమే రెండవ కాలగర్భం చుట్టు రెండవ కాలం రూపొందింపబడుతు వచ్చును. అలా ఆరకంగా స్థూల రసద్రావకాల మిళిత నిర్వహణలో భూపొరలు రూపొందింపబడతాయి. కాని రాయి అన్నది అదే స్థూల రసద్రావకాలు గట్టుగా కరుడుగట్టి రాయిగా నిర్మాణము అవుటలో దానిని బట్టి శబ్ద పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము శబ్దాన్ని కూర్చును. కాబట్టి భూపొర అలవరికలో ఏరక శబ్దము యుండదు. ఎందుచేతననగా స్థూలరసద్రావకాల మిళితంతో భూపొర అన్నది పొరల నిర్వహనగా పొడిపొడిగా యుండును. కావున శబ్దరీతి అలవరికలు యుండవు. కావున రాయిని కొంచెం పైనుంచి భూపొరపైన వేసినా శబ్దమురాకపోవుటకు కారణం ఇదే.